Home Page SliderTelangana

FRIENDS ఖాతాల్లోకి లంచం సొమ్ము

Share with

హైదరాబాద్: గొర్రెల సరఫరా పథకం కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఓఎస్‌డీగా వ్యవహరించిన గుండమరాజు కళ్యాణ్‌కుమార్ ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించిన ఏసీబీ, మరింత లోతుగా దర్యాప్తు చేపట్టడంతో పలు ఆసక్తికర అంశాలు బహిర్గతమయ్యాయి. దళారుల నుండి తన సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు కళ్యాణ్‌కుమార్ లంచం సొమ్మును బదిలీ చేయించుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.