Home Page SliderTelangana

బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో రైతులకు సన్మానం

Share with

ఆదిలాబాద్: కిసాన్ దివస్‌ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో గురువారం రైతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం నిర్వాహకురాలు రేవతి మాట్లాడుతూ దేశానికి రైతే రాజు అని, అహర్నిశలు కష్టించి పండించిన పంటలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. అలాంటి అన్నదాతలను మనమంతా గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, బ్రహ్మకుమారీలు, ఓ శాంతి ఓం భక్తులు పాల్గొన్నారు.