స్త్రీ పురుషులిద్దరూ సమానమే.. కానీ: సుధామూర్తి
లింగ సమానత్వంపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్త్రీ, పురుషులిద్దరూ సమానమే. కానీ, వారి వారి మార్గాల్లో వారు ప్రత్యేకంగా ఉంటారు. స్త్రీ, పురుషులిద్దరూ వేర్వేరు. వారిద్దరూ ఒక సైకిల్కు ఉన్న రెండు చక్రాల్లాంటివారు. ఒక చక్రం సహాయం లేకుండా ఇంకో చక్రం ముందుకు కదలలేదు అని పేర్కొన్నారు.