Home Page SliderTelangana

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 56% విజయవంతమైంది: ప్రహ్లాద్ జోషీ

Share with

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ.. ఎంపీలతో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు.

ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ శాతం 56గా ఉంటే, కాంగ్రెస్‌ది 18 శాతం మాత్రమేనని ప్రధాని మోడీ వెల్లడించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ఎంపీలకు తెలియజేశారన్నారు. మూడు రాష్ట్రాల్లో పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించినట్లు చెప్పారు.