Andhra PradeshHome Page Slider

రాష్ట్రంలో అకృత్యాలకు బీజేపీ కూడా బాధ్యత వహించాలి…విజయసాయిరెడ్డి

Share with

వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న అకృత్యాలకు బీజేపీ కూడా బాధ్యత వహించాలని మీడియాతో పేర్కొన్నారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవ్వరూ అధైర్యపడొద్దని, వారందరికీ వైసీపీ నాయకుడు జగన్ అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ దాడులపై పోలీస్ కంప్లైట్లు తీసుకునే నాధుడు కూడా లేడని వాపోయారు. దాడులకు బలైన వారందరి ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తామని పేర్కొన్నారు. ఈ దాడులపై కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని, ప్రస్తుతం బీజేపీ కూడా ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందువల్ల ఈ దాడులకు బాధ్యత వహించవలసి ఉంటుందని పేర్కొన్నారు. వారు స్పందించకపోతే న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.