మొదటి రోజే అసెంబ్లీ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన
తెలంగాణ అసెంబ్లీకి మొదటి రోజే నిరసన జ్వాల తగిలింది. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకరుగా ఎంఐఎంకు చెందిన అక్బరుద్దీన్ను నియమించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేయడానికి ప్రయత్నించారు. గేట్ నంబర్ 2 వద్ద వారు ఆందోళనలు చేస్తుండగా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీనితో అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకరుగా ఉంటే తామెవ్వరూ ప్రమాణ స్వీకారం చేయమని తేల్చి చెప్పారు. వారి అసమ్మతిని తెలియజేస్తూ నేడు బీజేపీ ఎమ్మెల్యేలెవ్వరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళనలకు అనుమతించేది లేదని వారిని అడ్డగించారు సిబ్బంది.