రమేష్ రాథోడ్ మృతిపట్ల బీజేపీ నేతల సంతాపం
టిజి: ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గిరిజనులకు.. ఆదిలాబాద్ జిల్లాకు ఆయన ఎంతో కృషి చేశారని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో రమేష్ రాథోడ్ కీలకంగా వ్యవహరించారని బీజేపీ నేతలు గుర్తు చేసుకున్నారు.