Home Page SliderTelangana

కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్

Share with

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.  ఈ నేపథ్యంలో తెలంగాణా బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ నియామకాలపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న పరీక్షలు, నియామకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. దీంతో లక్షలాదిమంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని ఆయన తెలిపారు. అయితే కేంద్రం ఎంతో పారదర్శకంగా నియామకాలు చేపడుతుందన్నారు. కాగా హైదరాబాద్-హకీంపేటలో రోజ్‌గార్ మేళాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కిషన్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.