Home Page SliderTelangana

గజ్వేల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్

Share with

గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గజ్వేల్ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్. బెజగామ గ్రామంలో ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే పెన్షన్లు పోవు. అన్నీ ఇస్తూనే.. ముసలివాళ్ళు ఇద్దరికీ పెన్షన్ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటుగా.. ప్రైవేట్ కంపెనీలలో కూడా మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. కెసిఆర్‌కి ఇంకోసారి ఓటు వేస్తే భూములు కాదు ఊర్లు మాయం చేస్తాడు.

బీజేపీ వస్తే ఒక్క ఎకరం భూమి కూడా తీసుకోము. పదేళ్లుగా ఎమ్మెల్యే ఎవరు అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పుకొని మురిసారు. కానీ మీకు ఒరిగిందేమీ లేదు. కనీసం ఆయన ముఖం కూడా చూడలేదు. నన్ను గెలిపించండి మీకు అందుబాటులో ఉంటా. కో అంటే కో అంటా. మీ కాలికి ముల్లు కుచ్చుకుంటే పంటితో తీసే సేవ చేస్తా.