NewsTelangana

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బిర్సా ముండా జయంతి వేడుకలు

Share with

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బిర్సా ముండా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రవీంద్ర నాయక్‌, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌తోపాటు పలువురు ప్రముఖులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిర్సా ముండా సేవలను నేతలు కొనియాడారు. భారత దేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్య వాద శక్తులను తరిమికొట్టేందుకు ఎంతో మంది పోరాటం చేశారని బీజేపీ నాయకులు తెలిపారు. గిరిజనులపై వేసిన పన్నులు, దోపిడీని అడ్డుకునేందుకు బిర్సా ముండా పోరాటం చేశారని అన్నారు. బలవంతంగా మత మార్పిడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఎదిరించారన్నారు. ఆయన బాటలో నడిచి జాతి సమైక్యత కోసం మనమంతా పోరాటానికి సిద్ధం కావాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు.