బిగ్బాస్-7 విన్నర్ అరెస్ట్
బిగ్బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్,అతడి సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఆదివారం బిగ్బాస్ విజేతగా బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్కు ఆయన అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది.ఈ క్రమంలో ఆయన అభిమానులు రన్నరప్ అమర్ దీప్,అశ్వినీ కార్లతోపాటు ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా వారు పగుల గొట్టారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పల్లవి ప్రశాంత్ను బుధవారం తన స్వగ్రామం కొలుగూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బిగ్బాస్ విన్నర్గా హౌస్ నుంచి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ పోలీసుల అనుమతి లేకుండా తన అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా అదే సమయంలో హౌస్ నుంచి బయటకు వచ్చిన అమర్ దీప్కు కూడా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్,అమర్ దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో వారు అమర్ దీప్,అశ్వినీ,గీతు రాయల్ కార్ల అద్దాలతో పాటు ఓ ఆర్టీసీ బస్సు అద్దాలను సైతం ధ్వంసం చేశారు. దీంతో గీతు రాయల్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్గా తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద పల్లని ప్రశాంత్పై కేసు నమోదు చేశారు.