బిగ్బాస్ విన్నర్కు బెయిల్
బిగ్బాస్-7 విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కు బెయిల్ లభించింది. కాగా అతనికి ఇవాళ హైదరాబాద్ నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. కాగా పల్లవి ప్రశాంత్ విన్నర్గా హౌస్ బయటకు వచ్చి తన అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీలో పల్లవి ప్రశాంత్ అభిమానులు బిగ్బాస్ రన్నరప్ అమర్ దీప్,కంటెస్టెంట్ అశ్వినీ,ఇంటర్వ్యూయర్ గీతు రాయల్ కార్లపై దాడి చేశారు. అంతేకాకుండా వారు ఓ ఆర్టీసీ బస్సు అద్దాలను సైతం పగుల గొట్టారు. దీంతో ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యి పల్లవి ప్రశాంత్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు బుధవారం పల్లవి ప్రశాంత్ను తన స్వగ్రామం కొలగూరులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి జాబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉంచి నిన్న చంచల్ గూడ జైలుకు తరలించారు.ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ బెయిల్ కోసం హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ కేసుపై ఈ రోజు విచారణ జరిపిన నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్కు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసినట్లు ప్రకటించింది.