టీ 20లో బంగ్లాపై ఆఫ్గాన్ గెలుపుతో ఆస్ట్రేలియా సెమీస్ నుండి ఔట్
టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో బంగ్లాపై గెలుపుతో ఆఫ్గానిస్థాన్ టీ20 ప్రపంచకప్ సెమీస్కు దూసుకుపోయింది. దీనివల్ల బంగ్లాదేశ్తో పాటు ఆస్ట్రేలియా టీమ్ కూడా సెమీస్కు చేరకుండా వెనుదిరుగుతోంది. ఈ పొట్ట కప్లో సంచలనాలు సాధించిన ఆఫ్గాన్ టీమ్ పట్టు వదలకుండా గట్టి ప్రయత్నంతో ఆస్ట్రేలియా లాంటి లెజెండ్ టీమ్ను మొదటి సారి ఓడించింది. అంతేకాదు బలమైన టీమ్గా పేరుపొందిన న్యూజిలాండ్ను కూడా ఓడించింది. ఆఫ్గాన్ 115 పరుగుల చిన్న లక్ష్యాన్నే బంగ్లాదేశ్ ముందు నిలిపినా వారు నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని చేధించలేకపోయారు. 17.5 ఓవర్లకే బంగ్లాదేశ్ను 105 పరుగులకే ఆలౌట్ చేసింది. దీనితో సూపర్ 8 నుండి గ్రూప్1లో భారత్, ఆఫ్గాన్ నాకౌట్ స్టేజ్కు వెళ్లాయి. గురువారం ఉదయం దక్షిణాఫ్రికాతో తొలిసెమీస్లో ఆఫ్గాన్ తలపడనుంది. ఆరోజే రాత్రి భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండవ సెమీస్ జరగనుంది.