Home Page SliderTelangana

హైదరాబాద్‌లో పబ్ డీజేల అరెస్టు.. డ్రగ్స్ పంపిణీ

Share with

హైదరాబాద్‌లో ఇద్దరు పబ్ డీజేలను అరెస్టు చేశారు. పబ్‌లలో పనిచేస్తూ మాదకద్రవ్యాల పంపిణీ, అమ్మకం చేస్తున్నారనే అభియోగంపై ఈ అరెస్టు జరిగింది. బెంగళూరుకు చెందిన డీజే సన్ని, హైదరాబాద్‌కు చెందిన డీజే అఖిల్‌లు ఈ పనులు చేస్తున్నట్లు గుర్తించారు. అఖిల్ హైదరాబాద్‌లోని పలు పబ్బుల్లో పని చేస్తుంటాడు. వీరిద్దరితో పాటు ఇద్దరు విద్యార్థులను కూడా అరెస్టు చేశారు. వీరిద్దరూ కలిసి గంజాయి, కొకైన్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వీఐపీ కస్టమర్లను గుర్తించి, వీరు డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు. వీరు అదనపు సంపాదన కోసం ఈ పనులకు పాల్పడినట్లు ఎకైజ్ పోలీసులు తెలిపారు. వీరి వద్ద పెద్ద మొత్తంలో డ్రగ్స్ గుర్తించారు. వీరు బెంగళూరు, ముంబై, గోవాల నుండి డ్రగ్స్ తీసుకువచ్చి సరఫరాలు చేస్తున్నట్లు సమాచారం. వీరి విషయం ఆయా పబ్ నిర్వాహకులకు తెలుసా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరితో పాటు డ్రగ్స్ వినియోగించే నలుగురు విద్యార్థులను కూడా అరెస్టు చేశారు. ఈ విద్యార్థులలో నవీన్ అనే యువకుడు ఎన్‌ఐటీ విద్యార్థి అని,బాగా చదివేవాడని పోలీసులు తెలిపారు. తనకు తెలియకుండానే డ్రగ్స్‌కు బానిస అయ్యాడని పేర్కొన్నారు. ఈ డ్రగ్స్ కోసం బెంగళూరు వెళ్లి డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలు మొదలుపెట్టాడని తెలిపారు.