ఏపీ వాలంటీర్ల కొనసాగింపుపై ఏపీ మంత్రి వ్యాఖ్యలు
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయలేదని, కొనసాగిస్తామని మంత్రి డోలా బాలాంజనేయస్వామి హామీ ఇచ్చారు. నేడు ఆయన సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ మంత్రిగా సచివాలయంలోని 3వ బ్లాకులో బాధ్యతలు స్వీకరించారు. ఈ జూలై1న ఇంటింటికీ పెన్షన్లు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే వాలంటీర్లను తిరిగి ఉద్యోగంలో తీసుకునే విషయంలో స్పష్టత వస్తుందన్నారు.