Andhra PradeshNews

ఏపీ మంత్రి విశ్వరూప్‌కు తీవ్ర అస్వస్థత

Share with

నేడు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి.దీంతో తెలుగు రాష్ట్రాలలోని వైసీపీ నేతలు,మంత్రులు వైఎస్ విగ్రహాలకు ఘన నివాళులు అర్పించారు. అంతేకాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు అమలాపురంలో వైఎస్ వర్థంతి కార్యక్రమాన్ని అక్కడి నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం అక్కడ జరిగిన కార్యక్రమంలో ఏపీ మంత్రి విశ్వరూప్ పాల్గొన్నారు.  అయితే కార్యక్రమం అనంతరం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను రాజమండ్రిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విశ్వరూప్ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.