Andhra PradeshNews

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

Share with

ఈ రోజు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 57 అంశాలకు సంబంధించి ఈ కేబినెట్ సమావేశంలో  చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా సచివాలయంలో 85 కొత్త పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీ చేయటానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటువంటి కీలక నిర్ణయాలు,చర్చలతో నేటి ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది.