పట్టాలెక్కిన మరో వందేభారత్ ఎక్స్ప్రెస్
మధ్యప్రదేశ్,ఢిల్లీ మధ్య మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ ఇవాళ పట్టాలెక్కింది. భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్లే ఈ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దీని ద్వారా ఢిల్లీ ,మధ్యప్రదేశ్ మధ్య దూరం బాగా తగ్గుతుందని మోదీ అన్నారు. కాగా మధ్యప్రదేశ్కి ఢిల్లీకి మధ్య దూరం 708 కిలోమీటర్లు ఉంది. ఈ రైలు ద్వారా కేవలం 7 గంల్లోనే మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీ చేరుకోవచ్చన్నారు. కాగా ఇది దేశంలో 12 వ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుగా ఉంది. అతి త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సికింద్రాబాద్-తిరుపతి మధ్య కూడా మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది.