TSPSC లీకేజ్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్
TSPSC లీకేజ్ కేసులో తవ్వే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలికి వస్తున్నాయి.రోజుకో మలుపులతో ట్విస్ట్లు ఇస్తోంది TSPSC లీకేజ్ వ్యవహారం. గ్రూప్ -1 పేపర్ను ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్లు ఓసీటీలో లీక్ చేయగా… అక్కడ ఆఫీస్లోని సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేశ్ ముందుగానే గుర్తించినట్లు సిట్ విచారణలో తెలిసింది. ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండడానికి గాను ప్రవీణ్ వారిద్దరికీ గ్రూప్-1 పేపర్ను ఇస్తామని ఆశ చూపించాడని వారు తెలియజేశారు. అందుకే వారు ఈ లీకేజి విషయాన్ని ఎవరికీ చెప్పకుండా, వారిద్దరూ ఆ పేపర్ను న్యూజిలాండ్లోని ప్రశాంత్కు, హైదరాబాద్లోని సురేశ్కు పంపించినట్లు బయటపడింది.