నాని-వివేక్ ఆత్రేయల కాంబోలో మరో సినిమా..
దర్శకుడు వివేక్ ఆత్రేయతో కలిసి నవ్వులు పూయించడానికి నాని మరోసారి సిద్ధమయ్యారు. నేడు ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు హీరో నాని. అంటే సుందరానికి అంటూ వివేక్ ఆత్రేయతో కలిసి గతంలో నవ్వులు పూయించిన ఆయన మరోసారి ఆ దర్శకుడితో కలిసి సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు.
ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటినుంచి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సినిమాల పేర్లన్నీ ఆకట్టుకునేలా ఉంటాయి. మెంటల్ మదిలో, అంటే సుందరానికి అంటూ టైటిల్తోనే ఆయన ఆసక్తి కలిగిస్తారు. ఇప్పుడీ సినిమాకు కూడా సరిపోదా శనివారం అని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఇక ఇందులో ప్రియాంక అరుణ్ మోహన్ను ఎంపికచేసినట్లు తెలుస్తోంది. దసరా రోజు ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. అలాగే అక్టోబర్ 24 నుంచి దీని షూటింగ్ మొదలౌతుంది. ఈ సినిమా కూడా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది.
ఇక ప్రస్తుతం నాని హాయ్ నాన్నలో నటిస్తున్నారు. శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు దీన్ని తెరకెక్కిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఇదే పేరుతో రానుండగా.. హిందీలో మాత్రం హాయ్ పాపా పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇందులోని పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందుతాయి.