Home Page SliderTelangana

తెలంగాణ నుండి జగనన్నకోసం సైకిల్ యాత్ర చేసిన వీరాభిమాని

Share with

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్‌కు ఆంద్రప్రదేశ్‌లోనే కాదు ఇతర రాష్ట్రాలలోనూ అభిమానులు పెరిగిపోతున్నారు. గతంలో మహారాష్ట్రలోని షోలాపూర్‌కి చెందిన అభిమాని సైకిల్ యాత్రపై జగన్‌ను కలవడానికి వచ్చారు. ఇప్పడు అలాంటి సంఘటనే మరోటి జరిగింది.  జనగాం జిల్లా లింగంపల్లికి చెందిన ఓ యువకుడు జగన్‌కి వీరాభిమాని.  అతని పేరు ప్రవీణ్. ఈయన వైయస్సార్ విగ్రహానికి మొక్కి తన సైకిల్ యాత్రను షురూ చేశాడు. తాడేపల్లికి వెళ్లి జగన్‌ను కలుస్తానని చెప్తున్నారు. జగన్ మళ్లీ సీఎం కావడమే తన యాత్ర లక్ష్యమన్నాడు. తన షర్టుపై ‘రావాలి జగన్, కావాలి జగన్’, ‘మళ్లీ మీరే సీఎం కావాలి జగనన్న’, ‘ఆ వైఎస్ దేవుని పాలన మీతోనే సాధ్యం’, ‘రెండవసారి సీఎం కావాలి జగన్ సారు ‘అంటూ జగన్ ఫొటో వేసి ప్రింట్ చేయించుకున్నాడీ అభిమాని. మరి జగన్ అపాయింట్‌మెంట్ ఇస్తాడో లేదో చూడాలి.