Home Page SliderTelangana

జమ్మికుంటలో బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా

Share with

కరీంనగర్: హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా జమ్మికుంటలో జరిగిన బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ: 119 నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లు గెలవాలని రాష్ట్రమంతా పక్షిలా తిరిగి వచ్చా.

నా భార్య జమున అన్నీ అమ్మి పెడతా కూలిపని అయినా చేస్తా నిన్ను సాదుకుంటా.. కెసిఆర్‌తో కొట్లాడమని చెప్పింది. అంతే కాదు నెల రోజుల నుండి మీ ఇంటింటికీ నన్ను గెలిపించాలని వచ్చింది.

మాదిగల ముప్పై ఏళ్ల సమస్యను బీజేపీ తీర్చింది. మోదీ గారు మీ సమస్యపై దృష్టి పెట్టారు. మాదిగ జాతి బిజెపికి అండగా ఉంటుంది అని ఆ  జాతి ప్రకటించింది.

రెండేళ్లుగా మా కార్యకర్తలను కోపం అనే నరం తెంపుకోమని చెప్పాను. మన లక్ష్యం ఈ చిల్లరగాళ్ళతో కొట్లాటకాదు. కెసిఆర్‌ను ఓడించడం అని చెప్పా. ఎన్ని అవమానాలు చేసిన ఓపికతో ఉంటున్నాం.

కెసిఆర్ డబ్బులు ప్యాక్ చేశారట, మందు సీసాలు రెడీ చేశారట. వచ్చినవి అన్నీ తీసుకోండి. ప్రతి ఒక్కరూ మీ ఎలక్షన్ అని కొట్లాడండి. ఈ గెలుపు మీ గెలుపు.

ఈటల రాజేందర్ ప్రగల్భాలు పలికేవాడు కాదు. ఏతులకు పొడు. నేను మాట ఇస్తే కట్టుబడి ఉంటా.. కెసిఆర్ లెక్క మాట తప్పను. ఈసారి గెలిస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ వస్తే.. వరి మద్దతు ధర రూ.2,160 నుండి 3,100 రూపాయలకు పెంచుతాం. ఒక్క కిలో తరుగులేకుండా కొంటాం. మహిళలకు నాలుగు సిలిండర్లు.. పదిలక్షల లోపు ఉచిత వైద్యం.. పిల్లలకు ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్య.. ఆడబిడ్డలకు వడ్డీలేని రుణాల పైసలు.. ఆడబిడ్డలకు ఇన్సూరెన్స్ ఉచితంగా..

రైతు చనిపోతే ఐదు లక్షలు ఎలా వస్తాయో రైతు కూలీ చనిపోతే కూడా ఐదు లక్షల రూపాయలు అందిస్తాము. సొంత ఇంటి కల నెరవేరుస్తాము. ముసలి వారి ఇద్దరికీ పెన్షన్ అందిస్తాము.

ఇవన్నీ రావాలంటే కెసిఆర్ ఓడిపోవాలి మీ బిడ్డ ఈటెల రాజేందర్ గెలవాలి. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఎంతమంది ప్రాణాలు కాపాడానో మీ అందరికీ తెలుసు. ఉద్యమ బిడ్డగా, ఆర్థిక మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా.. ఎన్నడూ కూడా మీకు  అన్యాయం చేయలేదు. ప్రజల నోట్లో నాలుకలాగా ఉన్నాను. రేపు కూడా అలానే ఉంటాను. కొంతమంది నా దగ్గరే ఉండి.. బయటకు పోయి నన్ను ఓడగొట్టాలని మాట్లాడుతున్నారంట.. ఓడ కొట్టే సత్తా కెసిఆర్‌కి, కేసీఆర్ బ్రోకర్లకి, పైసలకు అమ్ముడు పోయేవారికి లేదు. ఆ సత్తా హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకు మాత్రమే ఉంటుంది. నేను ఏం నష్టం చేశానని వారు నన్ను ఓడగొడతారు. వారి కళ్ళల్లో మెదిలిన బిడ్డను.

నాకు కులం లేదు, మతం లేదు, ఉన్నంతకాలం పార్టీతో సంబంధం లేకుండా కష్టంలో ఉన్న వారిని ఆదుకున్న బిడ్డ ఈటల రాజేందర్. కెసిఆర్ డబుల్ బెడ్ రూం, నిరుద్యోగ భృతి ఏ హామీ అమలు చేయకుండా ప్రజలను వంచించారు. గజ్వేల్‌కి ఉత్తగా పోలేదు..

కెసిఆర్‌ను గెలిపించిన పాపానికి వేల ఎకరాల భూమి గుంజుకొని గోసపెడుతున్నారు. ఓట్లు వేసేది ప్రజలు. మీ ఆత్మను ఆవిష్కరించివేయండి. నలభై ఏళ్లుగా ఇక్కడ కాంగ్రెస్ లేదు. 1985లో దామోదర్ రెడ్డి గెలిచాక ఇప్పటివరకు ఎవరు ఎన్నడూ గెలవలేదు.

నాఇంటికి ఎవరు వచ్చినా ఉన్నంతలో ఆదుకున్నా తప్ప ఉత్త చేతులతో పంపించలేదు. అధికారం వస్తే మీరు అడుక్కునే దగ్గర కాదు ఇచ్చే దగ్గర ఉంటారు. వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కార్యకర్తలు, నాయకులు ఈ రెండు రోజులపాటు నిద్రపోకుండా కష్టపడి పనిచేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను.