Home Page SliderTelangana

రేపు హైదరాబాద్‌లో వైభవంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ- పార్కులు, రెస్టారెంట్ల మూసివేత

Share with

రేపు (ఏప్రిల్ 14) అంబేద్కర్ జయంతి సందర్భంగా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్  ఆవిష్కరించబోతున్నారు. దీనితో బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని  అన్ని పార్కులు, రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు HMDA ప్రకటించింది. ఈ దారిలోని ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ ఘాట్, జలవిహార్, సంజీవయ్యపార్కు వంటి సందర్శన స్థలాలను కూడా రేపు మూసివేయనున్నారు. ఈ మార్గంలోని ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.