Andhra PradeshHome Page Slider

అమరావతి కేసు విచారణ జూలై 11కు వాయిదా

Share with

సుప్రీం కోర్టులో అమరావతి రాజధాని భూముల కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈ కేసులో ప్రతివాదులు చాలామంది ఉన్నారని, అందరి వాదనలు వినాల్సి ఉంటుందని తెలిపారు. జస్టిస్ జోసెఫ్ ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన స్టేను కూడా లెక్కలోకి తీసుకోవాలని సూచించింది. డిసెంబరులో విచారణ మొదలయినప్పుడు ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న అమరావతి రైతులకు కూడా నోటీసులు జారీ చేయాలని కోరింది. చనిపోయిన వారి వారసులు కూడా ప్రతివాదులుగా జాయిన్ కావచ్చని తెలియజేసింది ధర్మాసనం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కనీసం వచ్చే నెలలోనైనా విచారణ చేపట్టాలని కోరింది. తమకు ముఖ్యమైన కేసులు ఇంకా చాలా ఉన్నాయని, ఈ కేసును జూలై 11 లోగా విచారించడం సాధ్యపడదని తెలియజేశారు.