Home Page SliderTelangana

తెలంగాణాలో స్టాఫ్ నర్సు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అలర్ట్

Share with

తెలంగాణా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్ష వచ్చే నెల 2న జరగనుంది. ఈ నేపథ్యంలో స్టాఫ్ నర్సు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక సూచనలు చేసింది. కాగా ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష హాలులోకి పెన్ను,హాల్‌టికెట్,ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ మాత్రమే తీసుకురావాలని సూచించారు. అభ్యర్థులు బూట్లు కాకుండా చెప్పులు మాత్రమే వేసుకొని పరీక్ష హాలులోకి రావాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మార్గదర్శకాల్లో పేర్కొంది. అంతేకాకుండా చేతులకు మెహందీ,ఇంకు,టాటులు ఉన్నవారిని పరీక్ష హాల్‌లోకి అనుమతించబోమని  మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు స్పష్టం చేసింది.