ఖమ్మంలో ‘శ్రీకృష్ణుడి’ రూపంలో ఎన్టీఆర్ విగ్రహంపై రచ్చ
ఖమ్మంలోని ‘లకారం ట్యాంక్బండ్పై’ కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయబోతున్న వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ విగ్రహావిష్కరణకు ‘జూనియర్ ఎన్టీఆర్’ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. రాజకీయ, సామాజిక, పర్యావరణ నిపుణులు రకరకాల అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ సారథ్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనిపై హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ను కృష్ణుడి రూపంలో పెట్టడంతో భవిష్యత్ తరాల వారు ఎన్టీఅరే కృష్ణుడు అనుకునే ప్రమాదం ఉందని, హిందూ యాదవ సంఘాలు గగ్గోలు పెడుతున్నారు. ఎన్టీఆర్ను మహానటుడుగా, అభిమాన నాయకునిగా అభిమానించినా భగవంతుని స్థాయిలో పోల్చరాదని వారి వాదన. కావాలంటే మనిషిగా ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోమని, కానీ కృష్ణుని రూపంలో పెట్టడాన్ని అంగీకరించమంటున్నారు. యాదవ, కమ్మ సంఘాల వారి ఓట్ల కోసమే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని మండిపడుతున్నారు రాజకీయపక్షాలు.