Andhra PradeshHome Page Slider

మంగళగిరిలో బాప్టిజం ఘాట్ వద్ద ఆందోళనలు

Share with

మంగళగిరిలో బాప్టిజం ఘాట్ వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. మత మార్పిడులను ప్రోత్సహించేటందుకే ఈ బాప్టిజం ఘాట్ నిర్మిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఇలాంటి పనులకు ఎలా కేటాయిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. పవిత్ర స్నానాల కోసం ఎప్పటి నుండో ప్రభుత్వాన్ని అడుగుతున్నామని, అందుకే తమకు ఈ స్థలాన్ని కేటాయించారని, నిర్మాణం చేస్తున్నామని క్రైస్తవ సంఘాలు వాదిస్తున్నాయి. మతం మారే సమయంలో ఇలాంటి పవిత్ర స్నానాలు చేయిస్తారని , తమ ఆచారాల ప్రకారం తమ మతానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటున్నామని వారు పేర్కొంటున్నారు. అనవసరంగా బీజేపీ వ్యక్తులు అడ్డుకుంటున్నారని వారంటున్నారు. ఈ తగాదా రెండు పార్టీల మధ్యే కాకుండా , రెండు మతాల మధ్య కూడా తగాదాగా మారింది. పోలీసులు ఆందోళనలను నివారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.