Home Page SliderNational

ఆదిపురుష్ మూవీ@400 కోట్లు

Share with

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా,దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా “ఆదిపురుష్”.రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముని పాత్ర పోషించగా..హీరోయిన్ కృతిసనన్ సీత పాత్రలో మెప్పించారు. కాగా నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే 400 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.410 కోట్లు రాబట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. అంతేకాకుండా కుటుంబసమేతంగా సినిమా చూడాలని..టికెట్ ధరను తాజాగా రూ.150కు తగ్గించింది. దీంతో ఆక్యుపెన్సీ పెరగడంతో పాటుగా కలెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉందని చిత్ర నిర్మాతలు అభిప్రాయ పడుతున్నారు. మరి ఇదే జోరు కొనసాగితే ఆదిపురుష్ త్వరలోనే 500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.