National

నటి ఊర్వశి, పాక్ క్రికెటర్‌తో రీల్ రచ్చ

Share with

కొందరు ఏదో రకంగా సెలబ్రటీ అయిపోవాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా ఆకోవకి చెందినట్లుంది. సోషల్ మీడియాలో ఉన్నవీ, లేనివీ రాస్తూ, రకరకాల ఫొటోలు పెడుతూ హల్ చల్ చేసేస్తోంది ఈ అమ్మాయి. తాజాగా ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‌లో భారత్- పాక్ మధ్య దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌కు ఊర్వశి హాజరైంది. ఈ సందర్భంగా పాక్ క్రికెటర్ నసీమ్ షాతో రీల్ చేసి దానిని షేర్ చేసింది. దానిని చూసిన నెటిజన్లు మండిపడ్డారు. రీల్ చేసేందుకు నీకు పాక్ క్రికెటరే దొరికాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనితో ఆ వీడియోను తొలగించింది.

ఇదేం మొదటిసారి కాదట. ఇటీవలే రిషబ్ పంత్‌తో కూడా ట్విటర్ వార్ చేసిందట. ఆర్ పీ అనే వ్యక్తి తనను కలవడానికి ఎదురుచూస్తున్నాడని పోస్ట్ చేసింది. ఢిల్లీలో షూటింగ్ పూర్తయ్యాక అలసిపోయి, నిద్రపోయానని, పొద్దున్న చూస్తే 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయని పేర్కొంది. తన కోసం ఒకరు వేచి చూడడం బాధ అనిపించిందని ఆవేదన చెందింది. ఈ మాటలు పంత్‌ను ఉద్దేశించే అన్నదనే కామెంట్లు వచ్చాయి.

దీనిపై పంత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ, కొందరు పాపులారిటీ కోసం అబద్దాలు ఆడుతుంటారని వ్యాఖ్యానించాడు. దీనితో ఊర్వశి కూడా తక్కువ తినలేదు. ‘ఛోటూ భయ్యా, నువ్వెళ్లి క్రికెట్’ ఆడుకో అంటూ కామెంట్ చేసింది. సినీ,  క్రికెట్ తారల మధ్య ఇలాంటి నెట్ ఫైట్స్ ఈ మధ్య బాగా పాపులర్ అయిపోతున్నాయి.