Home Page SliderNational

బెంగళూరు రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసులో సినీనటి హేమకు బెయిల్

Share with

సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో సినీనటి హేమకు ఊరట లభించింది. 12 వ తేదీన ఆమెకు బెయిల్ మంజూరు చేయగా నేడు విడుదల అయ్యింది. ఆమె శరీరంలో డ్రగ్స్ ఉన్నాయని ఆమెను 14 రోజుల పాటు బెంగళూరు కోర్టు రిమాండుకు పంపింది. తాను బెంగళూరు పార్టీకి వెళ్లలేదని మొదట అబద్దాలు చెప్పినప్పటికీ తర్వాత వెళ్లినట్లు అంగీకరించింది. కానీ తాను ఏ డ్రగ్స్ తీసుకోలేదని పోలీసులు తనను ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా ఇరికించారని ఆరోపించారు. ఆమెకు బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు రిలీఫ్ కలిగించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీనితో పరప్పన అగ్రహార జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమె బయటకు వచ్చారు.