బండి సంజయ్కు ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు-కేంద్రపదవి దక్కినట్లేనా?
గత నాలుగు రోజులుగా దిల్లీలో ఉండి తిరిగి హైదరాబాద్కు వచ్చిన బీజేపీ ఎంపీ, మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ఎయిర్పోర్టులో ఘనస్వాగతం పలికారు బీజేపీ కార్యకర్తలు. బీజేపీ చీఫ్ నడ్డాతో సుదీర్ఘ చర్చల అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు బండి సంజయ్. మాస్ ఫాలోయింగ్ను బాగా సంపాదించుకున్న బండి సంజయ్ను భుజాలపై ఎత్తుకు తిప్పారు కార్యకర్తలు. ఇటీవల రాష్ట్ర బీజేపీలో పలు మార్పులు చేసింది అధిష్టానం. దీనిలో భాగంగా బండి సంజయ్ను అధ్యక్షస్థానం నుండి తప్పించి, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా చేశారు. మరి బండి సంజయ్కు కేంద్రంలో సహాయమంత్రి పదవి వస్తుందని బాగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇంతవరకూ అధిష్టానం నుండి ఎలాంటి ప్రకటన లేదు. కానీ బీజేపీ చీఫ్ నడ్డా బండి సంజయ్కు సముచిత స్థానం కలిపిస్తామని చెప్పినట్లు సమాచారం. ప్రధాని మోదీ ఈ నెల 8న వరంగల్ సభ ఉండడంతో బీజేపీ శ్రేణులందరూ ఈ సభపై దృష్టి పెట్టారు. ఈ సభను ఎలాగైనా సూపర్ సక్సెస్ చేయాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ అగ్రనాయకులందరూ వరంగల్లో తిష్టవేసి, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.