అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం..ఇద్దరు మృతి
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ప్రమాదం సంభవించింది. సాహీతీ ఫార్మా ల్యాబ్లో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు. కాగా పేలుడు తీవ్రతతో ఫార్మా ల్యాబ్లోని కార్మికులు భయంతో పరుగులు తీశారు. అయితే ప్రస్తుతం ల్యాబ్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. కాగా క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంతో సాహితీ ల్యాబ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పొగ దట్టంగా కమ్మేసింది.దీంతో ప్రమాదస్థలానికి చేరిన ఫైర్ ఇంజిన్ సిబ్బంది ప్రస్తుతం అక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.