Home Page SliderTelangana

గంగమ్మకు హారతులు ఇచ్చి, పూజలు చేశారు

Share with

సిద్దిపేట జోన్: గంగపుత్ర మహిళలు గంగమ్మకు వైభవంగా హారతులు ఇచ్చి, పూజలు చేశారు. స్థానిక కోమటి చెరువు గంగమ్మ దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు స్థానిక బోయిగల్లి నుండి కమాన్ మీదుగా జల పందిరితో కోలాటం ఆడుకుంటూ ర్యాలీగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటి చెరువులో తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గంగమ్మ గుడి ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.