News

ఫోన్ పిచ్చి అమ్మాయి..తండ్రి తిట్టాడంటూ జలపాతంలోకి…

Share with

అస్తమానూ ఫోన్ చూస్తున్నావంటూ తండ్రి తిట్టినందుకు అఘాయిత్యానికి పాల్పడిందో యువతి. 90 అడుగుల ఎత్తు నుండి జోరుగా ప్రవహిస్తున్న జలపాతంలోకి దూకేసింది. రాంచీ వద్ద భారత్ నయాగరా ఫాల్స్‌గా పేరుపొందిన చిత్రకూట్‌ జలపాతంలోకి దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది సరస్వతి మౌర్య అనే 21 ఏళ్ల యువతి. ఆమె జలపాతంలోకి దూకడం చూసిన స్థానికులు వెంటనే స్పందించి బోట్ల సహాయంతో ఆమెను కాపాడగలిగారు. నిత్యం ఫోన్‌తో కాలక్షేపం చేస్తున్నందువల్ల ఆమె తండ్రి తిట్టాడని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని పేర్కొంది ఆమె. దీనితో వారు విస్తుపోయారు. తప్పు చేయడమే కాక తండ్రి చిన్న మాట అన్నాడని, మితిమీరిన కోపంతో ఆత్మహత్య చేసుకోబోతున్నందుకు ఆమెను మందలించారు. ఇదంతా ఒకరు వీడియో తీయడంతో అది వైరల్ కావడం జరిగింది.