Home Page SliderNational

కేవలం పావుగంటలో 400 కోట్లు సంపాదించిన మహిళ

Share with

ప్రముఖ మహిళా వ్యాపారవేత్త రేఖా ఝన్‌ఝన్‌వాలా ఈ రోజు ‘నక్కతోక తొక్కారు’. కేవలం 15 నిముషాలలో ఆమె గతంలో ఎన్నడూ లేనంత అదృష్టవంతురాలయ్యింది. పావు గంటలో ఆమె ఆస్తి విలువ 400 కోట్ల రూపాయలు పెరిగింది. ఆమె పోర్ట్‌ఫోలియోలోని ‘టైటన్, టాటా మోటార్స్’ షేర్లు వాయువేగంతో పెరిగి పోవడంతో ఆమె ఆస్తి ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లు పెరిగిపోయింది. టైటాన్ షేర్ ధర 2548 రూపాయల నుండి 2598 రూపాయలకు చేరింది. టాటా మోటార్స్ షేర్ 452 రూపాయల నుండి 470 రూపాయలకు పెరగడంతో ఆమె వద్ద ఉన్న మొత్తం షేర్లు సుమారు 400 కోట్ల రూపాయలు పెరిగాయి. ఎలా అంటే ఆమెకు టైటాన్‌లో 4.58 కోట్ల షేర్లున్నాయి. ఇక టాటా మోటార్స్‌లో 5.22 కోట్ల షేర్లు ఉన్నాయిట. ఆమె ఇప్పటికే దేశంలోని అత్యంత సంపన్న వంతులలో ఒకరుగా చెలామణీ అవుతున్నారు.