National

తల్లి,బిడ్డను బలిగొన్న మెట్రో పిల్లర్

Share with

కర్ణాటక రాజధాని బెంగుళూరులో  అనుహ్య దుర్ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ ఒక్కసారిగా కూలడంతో తల్లి,మూడేళ్ల బాలుడు మృతి చెందారు. బెంగుళూరులోని నగర ప్రాంతంలో ఈ విషాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ కుటుంబ సభ్యులపై నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ ఇనుప రాడ్డు ఒక్కసారిగా జారిపడింది. ఈ దుర్ఘటనలో తల్లి,మూడేళ్ల బాలుడు ఘటనాస్థలంలోనే మృత్యువాత పడ్డారు. కాగా తండ్రి,కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో గాయపడి, ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని అక్కడి  ప్రజలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.