News

విశాఖకు మకాం.. సీఎం జగన్ కీలక ప్రకటన

Share with

విశాఖ: విశాఖకు మకాం మార్చడంపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ నాటికి విశాఖకు రాబోతున్నట్లు వెల్లడించారు. పరిపాలనా విభాగమంతా ఇక్కడికే వస్తుందని.. ఇక్కడి నుంచి పాలన కొనసాగిస్తానని తెలిపారు. విశాఖలో సీఎం జగన్ ఇవాళ పర్యటించారు. ఐటీ హిల్స్ వద్ద ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే జీవీఎంసీ బీచ్ క్లీనింగ్ వాహనాలను ప్రారంభించి మాట్లాడారు.

  విశాఖ నగరానికి ఉజ్జ్వల భవిష్యత్ ఉంది. వైజాగ్ కలల నగరంగా అభివృద్ధి చెందబోతోంది. ఇన్ఫోసిస్ రాకతో విశాఖ మరింత వేగంగా వృద్ధి చెందుతుంది. ఇన్ఫోసిస్‌కు అన్నివిధాలుగా సహకరిస్తాం. డిసెంబర్ నాటికి నేను కూడా విశాఖకు రాబోతున్నా. డిసెంబర్ నుంచి నేను కూడా విశాఖలోనే ఉంటాను అని సీఎం జగన్ వెల్లడించారు.