మాజీ సీఎం కాన్వాయ్కి తృటిలో తప్పిన ప్రమాదం
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం తప్పింది. కాగా ఆయన ఈ రోజు కడప ఎయిర్పోర్ట్ నుంచి పులివెందుల వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. జగన్ రామరాజుపల్లి వద్దకు చేరుకోగానే ఆయనను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు.దీంతో కాన్వాయ్లోని ఓ వాహన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజిన్ వెహికల్ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.