NewsTelangana

మునుగోడు ఉపఎన్నికలపై ఫిర్యాదుల పర్వం

Share with

మునుగోడు ఉపఎన్నికలలో అక్రమాలంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయ్.  ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ముందుగా బీజేపీ మునుగోడు ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మునుగోడులో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు బీజేపీ కేంద్ర మంత్రి మురళీధరన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఈసీని కలిశారు. ఈ సందర్భంగా  తరుణ్ చుగ్ మాట్లాడుతూ..అక్రమ మార్గాల ద్వారా విజయం సాధించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.