ప్రజలను మందుకు బానిసలుగా మారుస్తున్న ప్రభుత్వం-ఈటల
తెలంగాణ: రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. షాద్నగర్లో ఆయన మాట్లాడారు. ప్రజలు తాగుడుకు బానిసలవుతున్నారు. మద్యం ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్గా ఉంది. తాగుడు ద్వారా ఒక్కొక్కరు సీఎం కేసీఆర్కు రూ.45 వేలు తిరిగి చెల్లిస్తున్నారు. బీఆర్ఎస్కు మాటలు తప్ప చేతలు తక్కువ. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. బీజేపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈటల కోరారు.