Home Page SliderTelangana

ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలి: రఘునందన్

Share with

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తే అసలు దోషి బయటపడతాడని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2008 లోనే వైఎస్ హయాంలో కాళేశ్వరంపై సమీక్ష జరిగింది. నాడు 160 టీఎంసీలతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రతిపాదన చేశారు. వైఎస్ హయాంలోనే మరో 2 లక్షల ఎకరాల ఆయకట్టు పెంచేలా మరోసారి ప్రతిపాదన చేశారు అని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.