ప్రధాని సభకు వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదం –ఇద్దరు మృతి
ఛత్తీస్గడ్లో బీజేపీ వర్కర్లను తీసుకెళ్తున్న బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. నేడు జరుగుతున్న ప్రధాని మోదీ సభకు వెళ్తున్న బీజేపీ బస్సు ఛత్తీస్గడ్లోని బిలాస్పూర్లో ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. 47 మంది బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తులతో ఆ బస్సు అంబికాపూర్ నుండి రాయపూర్లో జరగనున్న మోదీ సభకు బయలుదేరింది. బిలాస్ పూర్ జిల్లాకు చేరుకోగానే రోడ్డు పక్కన నిలిచి ఉన్న ట్రాక్టర్ను ఉదయం 6 గంటల ప్రాంతంలో ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే బస్సుపై కంట్రోల్ తప్పి ఉంటుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారిని అపోలో హాస్పటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు.