సంగారెడ్డిలో 3 ఏటీఎమ్లను కొల్లగొట్టిన దొంగలు
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో దొంగలు రెచ్చిపోయారు. కాగా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని 3 SBI ఏటీఎమ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అయితే దొంగలు ఏటీఎమ్లలో ఉన్న సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా దొంగలు ఏటీఎమ్ల నుంచి రూ.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారి కోసం హైవేపై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దుండగుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.