పట్టణ ఓటర్లు ఎవరికి వారే.. ఓటుకు న్యాయం చేయండి..
హైదరాబాద్: ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరి ఓటు హక్కుకు ప్రత్యేక విలువ ఉంది. సక్రమంగా వినియోగించుకుంటేనే దేశ భవిష్యత్తు, అభివృద్ధికి కారకులమవుతాం. అయితే, ఓటరుగా నమోదు చేసుకోవడంలో చూపిస్తున్న ఉత్సాహం, ఆ తరువాత ఓటును పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేయడంలో ఓటరు అంతగా శ్రద్ధ చూపించడంలేదు. ఎవరికి వారు ఓటర్లు ముందుచూపుతో మెలగాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది.