నటుడు విక్రమ్కు గాయం
మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2లో ఆదిత కరికాలన్గా అద్భుత నటనతో చియాన్ విక్రమ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐతే అనుకోకుండా జరిగిన ఘటనతో గాయాలపాలయ్యాడు. తంగళన్ రిహార్సల్ సెషన్లో ప్రమాదానికి గురయ్యాడు. తంగళన్ షూటింగ్ నుండి కొంతకాలం విరామం తీసుకోవాల్సి వస్తోందని తెలుస్తోంది. దర్శకుడు పా రంజిత్ తంగలన్ చిత్రంలో చియాన్ విక్రమ్ పాల్గొంటున్నారు. ఈ ఏడాది కోలీవుడ్లో భారీ అంచనాలున్న సినిమాల్లో ఈ పీరియాడికల్ డ్రామా ఒకటి. గత కొన్ని నెలలుగా విక్రమ్ తంగళన్ షూటింగ్కు హాజరవుతున్నాడు. రిహార్సల్ సెషన్లో పక్కటెముకకు గాయమయ్యింది. తిరిగి షూటింగ్లో పాల్గొనడానికి మరికొంత సమయం పట్టొచ్చని వైద్యులు చెప్పారు. అదిత కరికాలన్ అకాగా, చియాన్ విక్రమ్ అందుకున్న ప్రేమ, ప్రశంసలకు, ప్రపంచం నలుమూలల నుండి అద్భుతమైన స్పందనలకు నటుడు ధన్యవాదాలు తెలిపాడు. రిహార్సల్స్లో చియాన్ గాయం కారణంగా పక్కటెముక విరిగిందని… దీంతో కొద్దిరోజులు షూటింగ్లో పాల్గొనలేడని విక్రమ్ పీఆర్వో ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.