సీఎం జగన్కు చంద్రబాబు ఛాలెంజ్
ఏపీలో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార,ప్రతిపక్షాల మధ్య రాజకీయ రగడ మొదలైనట్లు కన్పిస్తోంది. అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ..ప్రతిపక్షాలు పలు ఛాలెంజ్లు విసురుతున్నాయి. కాగా ఇటీవల టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫామ్ హౌస్తో తీసుకున్న సెల్ఫీ ఏపీలో రాజకీయాలలో దుమారం సృష్టించింది. కాగా లోకేష్ ఈ సెల్ఫీని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొన్నది గోరంత..ఆక్రమించింది కొండంత అని ఆరోపించారు. దీంతో ఈ సెల్ఫీ రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం ఇలాంటి ఫోటేనే ట్విటర్లో పోస్ట్ చేస్తూ సీఎం జగన్కు ఛాలెంజ్ విసిరారు. అదేంటంటే “చూడు జగన్.ఇవే మా హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు.రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు. అయితే ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లు ఎన్ని? నువ్వు చెప్పిన ఇళ్లు ఎక్కడ?జవాబు చెప్పగలవా? “అంటూ సీఎం జగన్ను చంద్రబాబు ట్యాగ్ చేశారు.