యాత్ర పై వస్తున్న అభిప్రాయలకు రాహుల్ క్లారిటీ
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారు. తను కొనసాగిస్తున్న యాత్ర గురించి కొందరు అంటున్న మాటలకు ధీటుగా ఈ ప్రెస్మీట్లో సమాధానం ఇచ్చారు. నాగర్ కోయిల్ లో రాహుల్ గాంధీ ప్రెస్మీట్ మాట్లాడిన ఆయన .. నా యాత్రపై ఎవరి అభిప్రాయం వారికి ఉండొచ్చు అన్నారు. కానీ తమ పార్టీకి సంబంధించినంత వరకు ఇది దేశ ప్రజలను అర్థం చేసుకునేందుకు మాకో అవకాశం అని పేర్కొన్నారు. అదే విధంగా బీజేపీ ఆలోచనా విధానాల వల్ల దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం అని స్పష్టం చేశారు.