బండి సంజయ్, రాజాసింగ్ అరెస్టు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తూ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారన్న ఆరోపణలపై రాజాసింగ్ను అరెస్టు చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా దీక్షకు కూర్చున్న బండి సంజయ్ను కూడా పోలీసులు జనగామలో అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్, రాజాసింగ్ల అరెస్టును హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసులతో, అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో నిర్బంధించిన 29 మంది బీజేపీ కార్యకర్తలను కూడా వెంటనే విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు.