Home Page SliderTelangana

70 ఏళ్లుగా ఉన్న అలవాటు.. తేలిగ్గా వదులుకోలేరు: మోడీ

Share with

హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చెందిన తరుణంలో ప్రధాని మోడీ మరోసారి హస్తం పార్టీపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ సందర్భంగా ఎమోజీలు ఉపయోగించి ఆయన చేసిన పోస్ట్ వైరల్‌ అవుతోంది.

    మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య సామాజిక మాధ్యమాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై కొందరు కాంగ్రెస్ అనుకూలురు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటికి బీజేపీ నేతలు గట్టిగా బదులిస్తున్నారు. కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ అహంకారం, అబద్ధాలు, నిరాశావాదం, అజ్ఞానంతో వారు బహుశా ఆనందంగానే ఉండి ఉంటారు. అది 70 ఏళ్లుగా వారికి అలవాటై పోయింది. అంత సులువుగా ఆ అలవాటు పోదన్న మోడీ.