NewsTelangana

త్వరలో మూసీ నదిపై 55 కిలోమీటర్ల ‘ఎక్స్‌ప్రెస్ వే’

Share with

హైదరాబాద్‌లోని మూసీనదిపై త్వరలోనే గొప్ప ఎక్స్‌ప్రెస్‌వే రాబోతోందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.మూసీనది సుందరీకరణపై అధ్యయనం చేశామని,  నది చుట్టుపక్కల ప్రాంతాల రూపు రేఖలు కూడా మారబోతున్నాయని, హైదరాబాద్  అతి త్వరలో దేశంలోనే అతిపెద్ద గ్రేటర్ నగరంగా రూపు దాల్చబోతోందని పేర్కొన్నారు. మూసీనది ప్రక్షాళనతో పాటు నది మీదుగా పదివేల కోట్ల రూపాయల ఖర్చుతో 55 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ వే ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఓ ఆర్ ఆర్ వెస్ట్ టు ఈస్ట్ మూసీ నదిపై  రోడ్డుల విషయంలో అధ్యయనాలు జరిగాయని, పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలియజేశారు.